The dilemma in AP Schools Holidays.
18 రాష్ట్రాల్లో విద్యా సంస్థలు బంద్ - రాష్ట్రంలో మూసివేతకు సీఎం నిరాసక్తి - పెరుగుతున్న కరోనా అనుమానితులు - రిస్క్ తీసుకోవడం అవసరమా - సెలవులిస్తేనే మేలంటున్న అధికారులు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించేశాయి . రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై డైలమాలో ఉంది . ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది . ఈ రెండు వారాల వ్యవధిలోనే 120 కేసులు పాజిటివ్ గా తేలాయి . పొరుగున ఉన్న తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసం స్థలు , సినిమాహాళ్లు , షాపింగ్ మాలు మూసేయాలని ఆదేశాలిచ్చాయి . బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను రద్దు చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు జారీచేశాయి . అయితే ఏపీలో ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది . కానీ , ప్రతి జిల్లాలోనూ రోజుకి ఇద్దరు , ముగ్గురు ఆస్పత్రుల్లో చేరుతు న్నారు . మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో మినీ హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తున్న ఆరోగ్య శాఖ . సోమవారం ప్రైవేటు ఆస్పత్రులతో కూడా చర్చలు జరిపింది . ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెయ్యి పడకలు సిద్ధం చేసుకోవాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాన్ని కోరారు . ఆదివారం సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా విద్యాసంస్థలు , సినిమా హాళ్ల మూసివేతపై చర్చించారు . సీఎంవోతో పాటు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా సెలవులు ప్రకటిస్తేనే మంచి దని సీఎంకు సూచించారు . దీనిపై సీఎం స్పందిస్తూ . . . ఎన్ని రోజులని సెలవు లిస్తాం . . అవసరం లేదు . . ? వైరస్ ప్రభావం అధికమైన ప్పుడు చూద్దాంలే . . అని దాటవేశారు . దీంతో అధికా రులు కూడా మిన్నకుండిపో యారు .
18 రాష్ట్రాల్లో విద్యా సంస్థలు బంద్ - రాష్ట్రంలో మూసివేతకు సీఎం నిరాసక్తి - పెరుగుతున్న కరోనా అనుమానితులు - రిస్క్ తీసుకోవడం అవసరమా - సెలవులిస్తేనే మేలంటున్న అధికారులు
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించేశాయి . రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీనిపై డైలమాలో ఉంది . ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది . ఈ రెండు వారాల వ్యవధిలోనే 120 కేసులు పాజిటివ్ గా తేలాయి . పొరుగున ఉన్న తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యాసం స్థలు , సినిమాహాళ్లు , షాపింగ్ మాలు మూసేయాలని ఆదేశాలిచ్చాయి . బహిరంగ ప్రదేశాల్లో సమావేశాలను రద్దు చేసుకోవాలని ప్రజలకు ఆదేశాలు జారీచేశాయి . అయితే ఏపీలో ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు మాత్రమే నమోదైంది . కానీ , ప్రతి జిల్లాలోనూ రోజుకి ఇద్దరు , ముగ్గురు ఆస్పత్రుల్లో చేరుతు న్నారు . మరోవైపు ఇప్పటికే రాష్ట్రంలో మినీ హెల్త్ ఎమర్జెన్సీని అమలు చేస్తున్న ఆరోగ్య శాఖ . సోమవారం ప్రైవేటు ఆస్పత్రులతో కూడా చర్చలు జరిపింది . ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి వెయ్యి పడకలు సిద్ధం చేసుకోవాలని ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాన్ని కోరారు . ఆదివారం సీఎం సమక్షంలో జరిగిన సమావేశంలో కూడా విద్యాసంస్థలు , సినిమా హాళ్ల మూసివేతపై చర్చించారు . సీఎంవోతో పాటు ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా సెలవులు ప్రకటిస్తేనే మంచి దని సీఎంకు సూచించారు . దీనిపై సీఎం స్పందిస్తూ . . . ఎన్ని రోజులని సెలవు లిస్తాం . . అవసరం లేదు . . ? వైరస్ ప్రభావం అధికమైన ప్పుడు చూద్దాంలే . . అని దాటవేశారు . దీంతో అధికా రులు కూడా మిన్నకుండిపో యారు .
0 Comments