AP cabinet meeting highlights: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా ఏపీ స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదాకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు
అమరావతి: స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం వివిధ అంశాలపై దాదాపు గంటన్నరసేపు చర్చించింది. ‘జగనన్న విద్యాకానుక పథకం’ ద్వారా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాల సంచులతో పాటు మూడు జతల దుస్తులు, రెండు జతల బూట్లు, పుస్తకాలను ఇవ్వాలనే ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించింది.
అమరావతి: స్టేట్ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదా బిల్లుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వచ్చే శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లును ప్రవేశ పెట్టాలని నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం వివిధ అంశాలపై దాదాపు గంటన్నరసేపు చర్చించింది. ‘జగనన్న విద్యాకానుక పథకం’ ద్వారా 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాల సంచులతో పాటు మూడు జతల దుస్తులు, రెండు జతల బూట్లు, పుస్తకాలను ఇవ్వాలనే ప్రతిపాదనపై మంత్రి వర్గం చర్చించింది.
0 Comments